బాబు వస్తే జాబు రాదు.. కరువే వచ్చింది.. సింహం సింగిల్‌గానే?: షర్మిళ

0
43

జాబు కావాలంటే బాబు రావాలని, బాబు వస్తే జాబు వస్తుందని అన్నారు కానీ, బాబు వస్తే కరవు వచ్చింది తప్ప ఉద్యోగాలు రాలేదని ఏపీ సీఎం చంద్రబాబుపై వైకాపా నేత షర్మిల మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ‘బై బై’ చెబుదామని వ్యాఖ్యానించారు.

వైసీపీ సింగిల్‌గా ఎన్నికల బరిలోకి దిగినా బంపర్ మెజార్టీ సాధిస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయని ప్రస్తావించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, సింహం సింగిల్‌గానే వస్తుందన్నట్టు వైసీపీ కూడా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో నిలిచిందని అన్నారు.

ప్రజలకు మంచి చేయాలంటే జగన్ అధికారంలోకి రావాలని, వెన్నుపోటు చంద్రబాబు పోవాలంటే, చెప్పింది చేసేవాడు కావాలంటే, రాజన్న రాజ్యం కావాలంటే తమ పార్టీకి ఒక్కసారి అవకాశమిచ్చి గెలిపించాలని, జగన్‌‌ని ముఖ్యమంత్రిని చేయాలని షర్మిళ ప్రజలను కోరారు.