వచ్చే నెల 11వ తేదీన జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం సృష్టించనుందని తాజా సర్వే వెల్లడించింది. ఈ సర్వేను మార్చి 25 నుంచి 30 వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. 16 చోట్ల టీఆర్ఎస్, హైదరాబాద్లో ఎంఐఎందే గెలుపు అని వెల్లడైంది. భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని తాజా సర్వేలు చెబుతున్నాయి.
ముఖ్యంగా, అధికార తెరాసకు విపక్షాలు దరిదాపుల్లో కూడా లేవు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేల్లో టీఆర్ఎస్కు జనాలు పట్టంకట్టారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 9 గ్రామాలు, మండలాలు, డివిజన్లలో శాంపిల్స్ సేకరించారు. టీఆర్ఎస్కు 57.45 శాతం ఓటర్లు జైకొట్టారు.
కాంగ్రెస్కు 28, బీజేపీకి 11.85 శాతం మంది మద్దతు ఇచ్చారు. టీఆర్ఎస్కు 62.29 శాతం మహిళలు మద్దతు పలికారు. 53.84 శాతం పురుషులు టీఆర్ఎస్కే ఓటేస్తామన్నారు. ఆదిలాబాద్, భువనగిరి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, జహీరాబాద్ పోటీలో ఉన్న టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలే గెలుస్తారని పేర్కొంది.