వడదెబ్బకు టీడీపీ అభ్యర్థి అస్వస్థత

0
43

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. అయినప్పటికీ అభ్యర్థులు ప్రచారంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కృష్ణా జిల్లా పెనమలూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు.

ఆదివారం ఆయన కంకిపాడులో ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఒక్కసారిగా స్పృహతప్పి కిందపడిపోయారు. ఎమ్మెల్యేకి ఏంజరిగిందో అర్థంకాక అనుచరులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

వెంటనే ఆయనను తాడిగడపలోని ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందించారు. ఎమ్మెల్యే వడదెబ్బకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన సమయంలో బోడె ప్రసాద్ శ్వాస సంబంధ ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తోంది.