25 ఎంపీ స్థానాల్లో మా పార్టీని గెలిపిస్తే.. హోదాను అడ్డుకోలేరు…

0
44
Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తన కొడుకు లోకేశ్‌కు మాత్రమే రెండు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప, ఉద్యోగాల భర్తీ అనేదే జరగలేదని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురావడం తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని, 25 ఎంపీ స్థానాల్లో తమ పార్టీని గెలిపిస్తే, తెలంగాణ నుంచి 17 ఎంపీలు తోడైతే కేంద్రంలో హోదాను అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు.

వైసీపీ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీతో పాటు పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలిచ్చే విధంగా చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి ఓ సచివాలయం ఏర్పాటు చేసి, వాటిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు.