భార్య అక్రమ సంబంధం.. ప్రియుడితో జంప్.. అధ్యాపకుడు ఏం చేశాడంటే?

0
33
Rushi Kanth
Rushi Kanth

రోజు రోజుకు మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తన భార్య తనను కాదని వేరొక వ్యక్తితో అక్రమసంబంధం కలిగివుండటాన్ని భరించలేని ఓ అధ్యాపకుడు తన పిల్లలతో కలిసి ఉరేసుకున్న ఘటన మహారాష్ట్ర సరిహద్దు పట్టణమైన బల్లార్‌పూర్‌లో కలకలం సృష్టించింది.

వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో కలత చెందిన ఓ అధ్యాపకుడు తన ఐదేళ్లలోపు చిన్నారులను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే రుషికాంత్ (40) ప్రైవేటు ఐటీఐలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు నారాయణి (5), కార్తిని (2)తో ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న వీరి కుటుంబంలో భార్య వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది.

వారం రోజుల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో రుషికాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరికి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.

పిల్లలు ఇద్దరినీ చున్నీతో ఉరివేసి చంపి ఆ ఫొటోలను భార్యకు వాట్సాప్ చేశాడు. అనంతరం ఇంటి పైకప్పుకు తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వాట్సాప్‌లో వచ్చిన ఫొటోలను చూసిన భార్య వెంటనే పోలీసులకు, తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అయినా బంధువులు, పోలీసులు వచ్చే లోపు జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.