నటుడిగా, నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో రాణించిన బండ్ల గణేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అపుడు ఆయన చేరిక సంచలనమైంది.
షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆయనకి నిరాశే ఎదురైంది. టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న బండ్ల గణేష్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు తాజాగా ప్రటించారు.
“నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.