భారత్‌లో ఎన్నికలు.. ఫేస్‌బుక్ అలెర్ట్.. ఇంటికెళ్లి మరీ తనిఖీలు.. అదుర్స్

0
66

కేంబ్రిడ్జ్ అనలిటికా వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఈ వ్యవహారంలో కోట్లాదిమంది ఫేస్ బుక్ ఖాతాదారుల డేటా లీకైనట్టు గుర్తించారు. దాంతో ఫేస్‌బుక్ విశ్వసనీయతపై విమర్శలొచ్చాయి. అప్పటినుంచి ఫేస్‌బుక్‌ ఖాతాల డేటాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కానీ ఫేస్‌బుక్‌ డేటా మాత్రం చోరీకి గురవుతున్నట్లు వార్తలు వస్తూనే వున్నాయి.

అప్పటినుంచి నిబంధనలను మరింత కట్టుదిట్టం చేస్తోంది ఫేస్‌బుక్. తాజాగా భారత్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పొలిటికల్ పోస్టులపై ఈ సోషల్ మీడియా దిగ్గజం ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ క్రమంలో, ఫేస్‌బుక్ ప్రతినిధులు ఢిల్లీలో ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి మరీ తనిఖీలు నిర్వహించారు. ఫేస్‌బుక్‌లో కనిపించిన ఓ పోస్టు పెట్టింది అతడా? కాదా? అనే విషయాన్ని అతడి ఇంటికి వెళ్లి మరీ నిర్ధారించుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఫేస్‌బుక్ ప్రతినిధులు ఆ వ్యక్తిని ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను చూపించమన్నారు. పోస్టు చేసిన వ్యక్తి తానేనా లేక మరెవరైనా చేశారా? అనేది తెలుసుకోవడానికి ఫేస్ బుక్ ప్రతినిధులు తన ఇంటికి వచ్చారని ఆ వ్యక్తి వెల్లడించారు.