కేసీఆర్ జిత్తులమారి నక్క.. మోడీ కోసం జగన్ బలిపశువు : హీరో శివాజీ

0
39

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సినీ నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ఒక జిత్తులమారి నక్క అని, ఆంధ్రులెవరూ ఆయన మాట నమ్మరని జోస్యం చెప్పారు. వైసీపీ అధినేత జగన్‌తో కలిసి కేసీఆర్ ప్రత్యేక హోదా డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్‌కు దమ్ముంటే జగన్‌కు మద్దతిస్తున్నామని చెప్పాలన్నారు. మోడీ ప్రధాని కావడానికి ఏపీ ప్రజలు బలి కావాలా? అని నిలదీశారు. జగన్‌కి కేసీఆర్, కేటీఆర్ సాయం చేస్తున్నారని శివాజీ ఆరోపించారు. రోజూ సాయంత్రం జగన్ హైదరాబాద్‌కు వెళుతున్నారని, కలిసి పని చేయడం తప్పు కాదని, కుట్రలు చేయడం తప్పన్నారు.

మోడీపై ప్రేమతో జగన్‌ను బలిపశువుని చేయబోతున్నారా? అంటూ కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఏపీ ప్రజలను అవమానించిన కేసీఆర్‌కు తిరిగి సమాధానం చెప్పే రోజు వస్తుందని ఆయన వెల్లడించారు. కేసీఆర్‌ను ఎందుకు నమ్మాలో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం మతం పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని శివాజీ విమర్శించారు.