తెరాస రిగ్గింగ్ చేసినా విజయం నాదేనంటున్న ‘కొండా’

0
33
konda vishweshwar reddy
konda vishweshwar reddy

చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పారిశ్రామికవేత్త కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, ఈ నెల 11వ తేదీన జరుగనున్న పోలింగ్‌పై ఆయన స్పందిస్తూ, అసెంబ్లీ ఎన్నికలప్పుడు.. తాండూరు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా పైలట్‌ రోహిత్‌ రెడ్డిదే విజయం అన్నారు. ఆయనకు 30 వేల ఓట్ల మెజారిటీ ఖాయం అనుకున్నాం. కానీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఈవీఎం రిగ్గింగ్‌తో మెజారిటీ 3 వేలకు తగ్గింది.

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో సక్రమంగా ఎన్నికలు జరిగితే 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీ కాంగ్రెస్‌ పార్టీకి వస్తుంది. తెరాస రిగ్గింగ్‌ చేసినా నేనే గెలుస్తా అని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానం కోసం తెరాస, బీజేపీ అభ్యర్థులు తలపడుతున్నారన్నారు. ఈయన తెరాస అధిష్టానంతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెల్సిందే.