శ్రీదేవి కుమార్తెపై కన్నేసిన జక్కన్న

0
69
jahnavi
jahnavi

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇపుడు కుర్ర హీరోయిన్లపై కన్నేశారు. తాను చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ చిత్రంలో వీరికి ఛాన్స్ కల్పించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు కుర్ర హీరోయిన్లు ఎవరో కాదు.. ఒకరు శ్రద్ధా కపూర్ కాగా, మరొకరు అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్.

నిజానికి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో కథానాయకులుగా నటిస్తోన్న చరణ్ జోడీగా అలియా భట్‌ను తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ నటి ‘డైసీ ఎడ్గర్ జోన్స్’ను ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఇపుడు రాజమౌళి మాత్రం శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్‌లపై దృష్టి పెట్టినట్టుగా సమాచారం. ‘సాహో’లో శ్రద్ధా కపూర్ పోర్షన్ దాదాపు పూర్తయిందట. దీంతో ఆమెను ఈ సినిమాలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా సమాచారం.

ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా శ్రద్ధా కపూర్ నో చెప్పినట్టయితే అపుడు జాన్వీ కపూర్‌ పేరును ఖరారు చేయాలన్న ఆలోచనలో జక్కన్న ఉన్నట్టు సమాచారం. మరి ఈ ఇద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. అజయ్ దేవగణ్ కీలమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, 2020 జూలై 30న విడుదల చేయనున్నారు.