రాజమౌళి ప్రాజెక్టులో ప్రభాస్… జోరుగా ప్రచారం…

0
61

ఇటీవ‌లి కాలంలో సినిమాల‌కి సంబంధించి వ‌స్తున్న‌ పుకార్లు విన‌డానికి బాగానే ఉన్నా, అది ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే దానిపై క్లారిటీ లేక అభిమానులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. తాజాగా రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్‌”లో ‘బాహుబ‌లి’ స్టార్ ప్ర‌భాస్ న‌టించ‌బోతున్నాడ‌నే వార్త దావానంలా పాకింది.

అల్లూరి సీతారామ‌రాజు, కొమరం భీమ్ పాత్రలు ప్ర‌భాస్ వాయిస్‌తోనే ప్రారంభం అవుతాయ‌ని ఓ ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, మ‌రో వైపు ప్ర‌భాస్ చిత్రంలో కీల‌క పాత్ర చేయ‌నున్నాడ‌నే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే పుకార్లు నిజమైతే అభిమానుల ఆనందానికి హ‌ద్దులు అనేవే వుండవు.

మరో వైపు ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్న బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్ స్థానంలో నిత్యా మీన‌న్ న‌టించ‌బోతుందంటూ ప్రచారం జ‌రుగుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై దర్శకుడు రాజమౌళి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య రూ.250 నుంచి రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టులు అజ‌య్ దేవ‌గ‌ణ్, అలియా భ‌ట్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది జూలై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.