ఆద్య లేకుంటే ఎప్పుడో చనిపోయేదాన్ని.. కాబోయే భర్త ఆడియో వినగానే రేణు?

0
50

 

ప్రముఖ హాస్యనటుడు అలీతో సరదాగా కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు కాబోయే భర్త ఇచ్చిన ఆడియో సందేశాన్ని విని కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరికి తెలిసే పెళ్లి చేసుకుంటానని.. ఇలాంటి విషయాలను దాచే ప్రసక్తే లేదన్నారు.

అలాగే కుమారుడు అకీరానందన్, కుమార్తె ఆద్య, స్నేహితురాలు ఇచ్చిన వాయిస్‌ను విని రేణూ ఎంతో సంతోషించారు. ఆద్య లేకుంటే తాను ఈపాటి ప్రాణాలతో వుండేదాన్ని కాదని చెప్పారు.

ఇకపోతే.. తాను పుట్టినప్పుడు తన తండ్రి ఆస్పత్రికి వచ్చి కూడా చూడలేదన్నారు. అమ్మాయి పుట్టిందనే చిరాకుతో తనను వచ్చి చూడలేదని చెప్పారు. అలాంటి మనిషే.. తనను చూసి గర్వపడుతున్నానని చెప్పారన్నారు.

ఇక అకీరా హైదరాబాదులో పుట్టిపెరగడం వలన తెలుగు బాగా మాట్లాడతాడు. ‘ఆద్య’ కూడా హైదరాబాదులోనే పుట్టింది. కాకపోతే .. చిన్నప్పటి నుంచి పూణేలోనే వుంది. అందువలన దానికి తెలుగు తెలియదు. మరాఠీ వచ్చు. అయితే తాను ఇంగ్లిష్ ఎక్కువగా మాట్లాడుతుందని మాతృభాష మాట్లాడించేందుకు ఎంతో కష్టపడవలసి వస్తుందని రేణూ చెప్పారు.

మోడలింగ్ వుండే తన ఫోటో చూసి పూరీ జగన్నాథ్ బద్రి సినిమాలో నటించేలా చేశారని.. నిజానికి తనకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు .. దర్శకత్వంపైనే ఎక్కువగా ఆసక్తి ఉండేది. పవన్ కల్యాణ్ పేరే అప్పటికి వినలేదు. అందువలన మొదట కుదరదని చెప్పేశాను .. కానీ పూరి గారు ఒప్పించారు.

అయితే సినిమా షూటింగుకి ముందు హీరోతో ఒకసారి మాట్లాడాలని చెప్పాను. అలా మొదటిసారిగా ‘తమ్ముడు’ సినిమా షూటింగు సమయంలో, రామానాయుడు స్టూడియోలో పవన్ కల్యాణ్‌ను చూశాను. అక్కడే మా పరిచయం జరిగిందన్నారు.