నా పరువు తీస్తున్నారు.. చర్యలు తీసుకోండి : పూనమ్ కౌర్

0
51

సినీ నటి పూనమ్ కౌర్ పోలీసులను ఆశ్రయించారు. తన గురించి అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అకతాయిలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో తనపై అసభ్యకర పోస్టులు, వీడియోలను యూట్యూబ్ ఛానళ్లలో పోస్ట్ చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అడిషనల్ డీసీపీ రఘువీర్‌ను కలిసిన పూనమ్ తన కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రఘువీర్ మీడియాతో మాట్లాడుతూ, పూనమ్ 36 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని రఘువీర్ తెలిపారు.