తెలుగు చిత్రపరిశ్రమకు మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం కానున్నారు. ఆయన పేరు వైష్ణవ్ తేజ్. కె.సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. చిత్రానికి సుకుమార్ కథను సమకూర్చుతుండగా, రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
సరికొత్త కథాంశంతో ఈ మూవీ రూపొందనుందని తెలుస్తుంది. బెస్తవాళ్ళ బ్యాక్డ్రాప్లో మూవీ తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుండగా ఇందులో వైష్ణవ్ బెస్తవాడిగా కనిపిస్తాడట. ‘రంగస్థలం’ వంటి ఎమోషనల్ మూవీలా ఈ చిత్రం ఉంటుందన్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్మెంట్ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్గా చేస్తున్నారు.
అయితే, ఈ చిత్రం కోసం హీరోయిన్ కోసం గత కొన్ని రోజులుగా గాలిస్తున్నారు. తాజాగా మలయాళ బ్యూటీ దేవిక సంజయ్ని హీరోయిన్గా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ అమ్మడు “ఎన్జన్ ప్రకాశన్” అనే మలయాళ చిత్రంతో బాగా పాపులర్ అయింది. ఫాహద్ ఫాజిల్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. సాయిధరమ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ గతంలో చిరు నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రంలో పేషెంట్గా నటించాడు. పవన్ చిత్రం జానీలో తొలిసారి వెండితెరపై కనిపించాడు. మరి హీరోగా ఎలా రాణిస్తాడో వేచిచూడాల్సిందే,