మోడీ ఓ నికమ్మా : నవజ్యోత్ సింగ్ సిద్ధూ

0
36

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ మోసగాడంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఐదేళ్ల పాలనతో మోదీ ప్రైవేటు వ్యక్తులకు మేలు చేయడం ద్వారా జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవహరిస్తున్నారని, అలాంటివాళ్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ‘మోదీ ఓ నికమ్మా’ (పనికిమాలినవాడు) అంటూ హిందీ పద ప్రయోగం చేశారు. జాతీయతా భావం పేరుతో ఓట్ల రాగం ఆలపించడం మానేసి జాతి ప్రయోజనాల గురించి మాట్లాడాలని మోదీకి హితవు పలికారు.