పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీని లండన్లో అరెస్ట్ చేశారు. నీరవ్ మోదీని హొల్బొర్న్లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరవ్ మోదీకి చెందిన ఖరీదైన కార్లను వేలం వేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయించింది.
ముంబైలోని ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్న ఈడీ నీరవ్ మోదీకి చెందిన 13 లగ్జరీ కార్లను వేలం వేయనుంది. రోల్స్ రాయిస్, పోర్సె పనమెరా, 2 మెర్సిడేజ్ బెంజ్, 3 హోండా కార్లు, టయోటా ఫార్చునర్, ఇన్నోవా, 2 హోండా బ్రియోస్తోపాటు ఇతర కార్లున్నాయి. అయితే ఈ కార్లకు టెస్ట్ డ్రైవ్కు అనుమతినివ్వమని స్పష్టం చేసింది ఈడీ.
లగ్జరీ కార్లకు సంబంధించిన ఫొటోలు, వాటి ధర, మోడల్, రిజిస్ట్రేషన్ నంబర్, స్థలం వంటి వివరాలను మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. నీరవ్మోదీకి సంబంధించిన 55 పెయింటింగ్స్ను సాఫ్రాన్ ఆర్ట్ గ్యాలరీ వద్ద అమ్మకాలు జరిపిన ఈడీ వాటి ద్వారా ఐటీ శాఖ రూ.54 కోట్లు ఆర్జించింది.