”లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను ఏపీలో విడుదల చేసే తేదీని ఏకపక్షంగా నిర్ణయించేశారని అంటున్నారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే మే 1న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేందుకు వర్మ యత్నించగా… పోలీసులు అడ్డుకుని, బలవంతంగా హైదరాబాద్ విమానం ఎక్కించి, పంపించేశారు. ఈ సందర్భంగా వర్మకు మద్దతుగా జగన్ ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ ఒక సైకో డైరెక్టర్ అని వ్యాఖ్యానించారు. వర్మలాంటి సైకోకు వైసీపీ అధినేత జగన్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు.