సప్తమీ తత్కాల అష్టమీ ఆదివారం.. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం

0
33

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిదేనని ప్రతి ఒక్కరూ బలంగా నమ్ముతున్నారు. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన వెల్లడికానున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపు మాత్రం జగనే అని శ్రీరామనాడి జ్యోతిష్యులు ఘంటాపథంగా చెబుతున్నారు.

అంతేనా… జగన్ ప్రమాణ స్వీకారానికి ఏకంగా ముహూర్తం కూడా పెట్టేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం శ్రీవిద్యా సర్వమంగళాదేవి పీఠానికి చెందిన జ్యోతిష్యుడు మురపాక కాళిదాసు శర్మ ఇప్పటికే జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి తేదీని ఖరారు చేశారు.

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి సప్తమీ తత్కాల అష్టమీ ఆదివారం మే 26 ఉదయం 9.29 గంటలకు దివ్యమైన ఘడియలు ఉన్నాయని చెబుతున్నారు. జగన్ జన్మనక్షత్రం రోహిణి అని, వైసీపీ ఆవిర్భావదినం ఆరుద్ర నక్షత్రాల కలయికలో అద్భుతమైన ముహూర్తం అని కాళిదాసు శర్మ అంటున్నారు.

గతంలో తాము తెలంగాణ ఎన్నికల్లో తెరాస గెలుస్తుందని 8 నెలల ముందే చెప్పామని, దేవనాడీ కాలచక్ర గ్రహ గతులను అనుసరించి ఖచ్చితమైన ఫలితాలు చెప్పామని అన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా జగనే విజేత అని పేర్కొన్నారు.

జగన్ ఎన్నికల్లో విజయం సాధించాలని తాము మార్చి 27 నుంచి ఏప్రిల్ 12 వరకు నీలాపతాక సహిత రాజశ్యామల యాగం చేసి, జగన్ చేతులమీదుగా వరుణ ప్రధానం తీసుకుని యాగాన్ని ముగించినట్టు శర్మ వివరించారు.