హీరోయిన్ తల్లికి కేన్సర్.. ఆమెకు మైగ్రేన్…

0
38

మలయాళ బ్యూటీ నిత్యామీనన్. దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్. ఆమె తాజాగా తన కష్టాలను ఏకరవుపెట్టింది. ఇంతకాలం తన కష్టాల గురించి బయటకు చెప్పని నిత్యామీనన్… ఇపుడు ఎందుకు చెబుతుందన్నదే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.

ఇటీవల ఓ ప్రాజెక్టు నిమిత్తం ఆమెను కలిసేందుకు కొందరు నిర్మాతలు ఆమె ఇంటికెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమె వారిని ఇంటికి ఆహ్వానించలేదు కదా, వారితో మాట్లాడేందుకు సైతం సమ్మతించలేదు. దీంతో నిత్యాకు పొగరని మాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అంతేకాదు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో భాగంగా నిత్యాను మాలీవుడ్ నుంచి నిషేధిస్తామంటూ కొందరు నిర్మాతలు బెదిరించినట్టు వార్తలు కూడా వచ్చాయి.

వీటిపై నిత్యామీనన్ క్లారిటీ ఇచ్చింది. తన తల్లికి కేన్సర్ మూడో దశలో ఉందని, షూటింగ్ సమయంలో తన తల్లి గుర్తొస్తే వ్యాన్‌లోకి వెళ్లి ఏడుస్తుంటానని తెలిపింది. అలాగే తనకు మైగ్రేన్ ఉందని, నిర్మాతలు వచ్చిన సమయంలో తాను ఎవరితోనూ మాట్లాడేస్థితిలో లేనని తెలిపింది. తనకు పొగరు అని ప్రచారం జరుగుతోందని, తాను వాటిని పట్టించుకోనని నిత్య తెలిపింది.