జేసీపై చర్యలు తీసుకోండి : కలెక్టర్‌కు ఈసీ ఆదేశం

0
38
jc-diwakar-reddy

తన కుమారుల గెలుపుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామన్న అనంతపురం సిట్టింగ్ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయనపై చర్యలకు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయని స్పష్టం చేసింది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమారులు జేసీ అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌కుమార్‌రెడ్డిల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చిందంటూ జేసీ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడిన వైసీపీ, సీపీఐ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

జేసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మాట్లాడడం నిజమేనని నిర్ధారించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.