ప్లీజ్.. నా దేశ భక్తిని శంకించవద్దు : అక్షయ్ కుమార్

0
50

తనకు రెండు పాస్‌పోర్టులు ఉన్నంతమాత్రాన తన దేశ భక్తిని శంకించవద్దని బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అంటున్నారు. ఇటీవల జరిగిన నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీనికి కారణం ఆయన కెనడా పౌరసత్వం ఉండటమే. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి.

ఈ విమర్శలపై ఈ పక్షిరాజు స్పందించారు. తనకు కెనడా పాస్‌పోర్టు ఉన్నంత మాత్రాన తన దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. తాను ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని, ‘బలమైన భారత్’ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తున్నట్టు ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.

తన భారత పౌరసత్వంపై చర్చ అర్థం లేనిదని, దేశంపై తనకున్న ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను ఏడేళ్లలో ఒక్కసారి కూడా కెనడాను సందర్శించలేదన్నారు. తన పౌరసత్వంపై ప్రజలు ఏమనుకున్నా తాను మాత్రం దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటానని వివరణ ఇచ్చారు.