రేటు పెంచిన పూజా హెగ్డే… 15 రోజులకు రూ.2 కోట్లు

0
56

బాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే. అటు హిందీలోనూ, ఇటు సౌత్‌లోనూ దున్నేస్తోంది. వరుస ఛాన్సులపై ఛాన్సులు కొట్టేస్తోంది. అల్లు అర్జున్‌తో జతకట్టిన ఈ అమ్మడు.. రామ్ చరణ్‌తో ఐటమ్ సాంగ్‌లో నర్తించి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.

ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ సినిమా చేయగా, తాజాగా మహేశ్ బాబుతో చేసిన ‘మహర్షి’ విడుదలకి ముస్తాబవుతోంది. ఇక ప్రభాస్‌తో చేస్తోన్న సాహో చిత్రం సెట్స్‌పై వుంది. ఇలా ఒక్కసారిగా పూజా హెగ్డే రేంజ్ పెరిగిపోవడంతో ఆమె తన పారితోషికాన్ని పెంచేసిందట. ఆమె చెప్పిన పారితోషకం హరీశ్ శంకర్ కళ్లు తిరిగేలా చేసిందని టాక్.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ రూపొందుతోంది. ఇందులో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమా కోసం మొదట ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావించారు. కానీ పూజా హెగ్డే అయితే ప్రాజెక్టు క్రేజ్ పెరుగుతుందని భావించి, ఆమెను సంప్రదించారు.

15 రోజులు కేటాయిస్తే చాలని చెప్పారట. అందుకు ఆమె రూ.2 కోట్లు పారితోషికంగా అడిగిందని సమాచారం. ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకి 75 లక్షలు తీసుకున్న పూజా, ఇప్పుడు రూ.2 కోట్లు అడగడంతో ఆ షాక్ నుంచి హరీశ్ ఇంకా తేరుకోలేదని చెప్పుకుంటున్నారు.