ఐపీఎల్ : చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోయిన ధోనీ సేన

0
52

స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ముఖ్యంగా, అందరికంటే ముందే నాకౌట్ బెర్త్ ఖరారు చేసుకుంది. కానీ, తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో చైన్నైపై విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. డుప్లెసిస్ తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. సురేశ్ రైనా (38 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో కరన్ (3/35), షమీ (2/17) రాణించారు.

అనంతరం లక్ష్యఛేదనలో లోకేశ్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ సాయంతో పంజాబ్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ (3/57) వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులిచ్చుకున్నాడు. రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.