ఇమిలీ ఛాన్స్ కొట్టేసిన ‘పద్మావతి’

0
33

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు కొత్త ప్రాజెక్టు ఇమిలీ. ఈ చిత్రంలో తొలుత కంగనా రనౌత్‌ను ఎంపిక చేశారు. అయితే, ఆమె పలు చిత్రాలు చేసేందుకు సమ్మతించింది. దీంతో పలు అనురాగ్ బసు చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

అదేసమయంలో కంగనా రనౌత్ స్థానంలో దీపికా ప‌దుకొణే అయితే బావుంటుందని అనురాగ్‌ బసు భావిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయట‌. ఈ చిత్రం నుంచి తప్పుకోవడం గురించి కంగనా మాట్లాడుతూ, ‘ఇమిలీ’ సినిమాలో నా మెంటర్‌తో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం దొరికింది అనుకున్నాను.

కానీ కుదరడం లేదు. డేట్స్‌ ఇష్యూ గురించి అనురాగ్‌గారితో మాట్లాడాను. ఆయన నా పరిస్థితి అర్థం చేసుకున్నార‌ని చెప్పింది. ‘ఇమిలీ’ చిత్రాన్ని 2018 నవంబర్‌లో స్టార్ట్‌ చేయాలి. కంగన ‘మణికర్ణిక’ సినిమాతో, నేను మరో ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యాం. ప్రస్తుతం ‘పంగా’ సినిమా చేస్తోంది. మళ్లీ త్వరలోనే మేం కలసి సినిమా చేస్తాం అని ద‌ర్శ‌కుడు తెలిపాడు.