వైకాపాలోకి వల్లభనేని వంశీ దంపతులు? బాంబు పేల్చిన వైకాపా ఎమ్మెల్యే

0
38

కరుడుగట్టిన టీడీపీ నేతగా ఉన్న వల్లభనేని వంశీ దంపతులు వైకాపాలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఈవిషయంపై గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పదేపదే చెబుతున్నారు. గత యేడాదిలో వల్లభనేని వంశీ దంపతులు బెంగళూరులో వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన మాట వాస్త‌వ‌మేన‌ని బాంబు పేల్చారు. ఇదే ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

నిజానికి వల్లభనేని వంశీకి, వెంకట్రావుకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు వంశీతో తనకు నేరుగా పరిచయమే లేదని, వంశీని తానెక్కడా విమర్శించలేదన్నారు. ఎమ్మెల్యే చేసిన దురాగతాలను ప్రజలు చెబితే ఆవిష‌యం మీడియా ముందు మాట్లాడానని.. త‌ను అమెరికా నుంచి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప డబ్బు సంపాదన కోసం కాదని స్పష్టం చేశారు.

వంశీపై తాను వ్యక్తిగత దూషణలకు దిగలేదని.. కానీ వంశీ మాత్రం దూషించారని ఆయన ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే వంశీపై ఆరాలు తీస్తే, త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్‌ని క‌ల‌సి పార్టీలో చేర‌తాన‌ని అడిన‌ట్టు తెలియ‌వ‌చ్చింద‌ని, ఇందుకు త‌మ పార్టీకి చెందిన ఒక నేత సార‌థ్యం వ‌హించిన‌ట్టు తెలిసింద‌ని, నేరుగా ఆత‌నితో సంభాషిస్తే… అవును వంశీ జ‌గ‌న్‌ని క‌ల‌సిన మాట వాస్త‌వ‌మ‌ని చెప్పిన‌ట్టు యార్ల‌గ‌డ్డ వివ‌రించారు.