ప్రియుడు కోసం భర్త కళ్ళలో కారం చల్లిన భార్య

0
45

ఇటీవలి కాలంలో భార్యలు భర్తల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని ఏకంగా భర్తలనే మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరహా సంఘటనలు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.

తాజాగా తన ప్రియుడుని భర్త నుంచి రక్షించేందుకు ఓ భార్య భర్త కళ్ళలో కారం చల్లింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని వాంబే కాలనీలో నివసిస్తున్న కోసూరు మురళీకృష్ణ భార్యతో గొడవపడి వేరేగా ఉంటున్నాడు. దీంతో ఒంటరిగా ఉన్న భార్య చీమలపాడు గ్రామానికి చెందిన గోకరాజుతో సహజీవనం చేస్తూ వస్తోంది.

ఈ క్రమంలో శనివారం రాత్రి తన భార్యతో గోకరాజు కలిసి ఉండడాన్ని చూసిన మురళీకృష్ణలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే తన వద్ద ఉన్న కల్లుగీత కత్తితో గోకరాజుపై దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడి నుంచి తేరుకున్న మురళీకృష్ణ భార్య.. భర్త బారి నుంచి ప్రియుడిని రక్షించేందుకు అతడి కళ్లలో కారం చల్లింది.

అతడు మంటతో విలవిల్లాడుతుండడంతో ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారైంది. ఆ తర్వాత తేరుకున్న మురళీకృష్ణ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న గోకరాజుకు చెందిన కొత్త ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన గోకరాజును ఆసుపత్రికి తరలించారు.