టాలీవుడ్కు పరిచయమై అతి తక్కువ చిత్రాలు నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ బాలీవుడ్ బ్యూటీ, పొడుగు కాళ్ల సుందరి అక్కినేని వారసులతో వరుసగా ‘సవ్యసాచి’, ‘మజ్ను’ చిత్రాలు చేసింది. ఈ మూవీలు నిధికి అంతగా హెల్ప్ కాకపోయినా ఆమెకు అవకాశాలు మాత్రం వస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ సినిమాలో నటిస్తోంది. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ మూవీని ‘ఇస్మార్ట్ శంకర్’ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల వారణాసిలో ఓ భారీ యాక్షన్ సీక్వెల్ చిత్రీకరించింది. దీంతో వారణాసి షెడ్యూల్ పూర్తి అయింది. పాట చిత్రీకరణ మిగిలిపోవడంతో త్వరలో చిత్రయూనిట్ విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
కాగా, హీరోయిన్ నిధి అగర్వాల్ తన పాస్పోర్ట్ పోగొట్టుకోవటంతో ఈ షెడ్యూల్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ షెడ్యూల్ తన వల్ల ఆలస్యం కాకూడదని భావించిన నిధి అతి కష్టం మీద అధికారులను ఒప్పించి పాస్పోర్ట్ను తిరిగి పొందింది. దీంతో చిత్రయూనిట్ ఊపిరిపీల్చుకుంది. అనుకున్న సమయానికే ‘ఇస్మార్ట్ శంకర్’ ఫారిన్ షెడ్యుల్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ మూవీలో నిధితో పాటు మరో కథానాయికగా నభా నటేష్ నటిస్తుంది. ‘మెలోడి బ్రహ్మా’ మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే నెలలోనే మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.