ముగ్గురు హీరోలతో ఒకేసారి.. ఎంజాయ్ చేశానంటున్న జిగేల్ రాణి

0
51

తెలుగులో జిగేల్ రాణిగా గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి పూజా హెగ్డే. ఇటీవలి కాలంలో ఈమెను వెతుక్కుంటూ సినీ ఛాన్సులు వస్తున్నాయి. ఆమె చేసిన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆమె తాజా చిత్రమైన ‘మహర్షి’ ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం నా అదృష్టం. ఎన్టీఆర్‌తో చేసిన ‘అరవింద సమేత’ భారీ విజయాన్ని అందుకోగా, మహేశ్‌తో చేసిన ‘మహర్షి’ రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. ఇక ప్రభాస్‌తో చేస్తోన్న సినిమా సెట్స్‌పై వుందన్నారు.

ఒకానొక సమయంలో ఒకే రోజున ఈ ముగ్గురు హీరోల షూటింగ్స్‌లో పాల్గొనాల్సి వచ్చింది. ఉదయం 7 నుంచి 12 వరకు ఎన్టీఆర్.. మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు మహేశ్‌తో .. రాత్రి 9 నుంచి ఉదయం 2 వరకూ ప్రభాస్‌తో కలిసి పనిచేశాను. ఇలాంటి అవకాశం రావడం కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.