ముందు యువరాజు.. ఇపుడు యువరాణి.. అయినా ఓడిపోతున్నారు : యోగి ఆదిత్యనాథ్

0
47

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దుర్యోధనుడుతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోల్చారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు.

అమేథీలో ప్రియాంక మాట్లాడిన మాటలు వింటే చిన్న పిల్లలు చెడిపోతారని, ఆమె తన తిట్లను ఇటలీ వెళ్లి అక్కడి వారికి నేర్పించాలని యోగి హితవు పలికారు. అమేథీలోని అమాయకులైన పిల్లలకు తిట్లు నేర్పడం ఎందుకు? అదేదో మీ ఇటలీకి వెళ్లి అక్కడివాళ్లకు నేర్పొచ్చు కదా అని వ్యాఖ్యానించారు.

“కాంగ్రెస్ ఎందుకు విఫలమవుతోందో తెలుసా? అది ప్రతికూల రాజకీయాలు చేస్తుంది కాబట్టి! మొదట యువరాజు (రాహుల్ గాంధీ)ని బరిలో దింపారు. ఇప్పుడు యువరాణి (ప్రియాంక గాంధీ)ని రంగంలోకి తీసుకువచ్చారు. మరి ఆ తర్వాతేమీలేదు, చివరికి అమేథీలో కూడా ఓడిపోబోతున్నారు” అంటూ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, తన తండ్రి రాజీవ్ గాంధీని నంబర్ వన్ అవినీతిపరుడంటూ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అదేసమయంలో కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రాహుల్, ప్రియాంకా గాంధీలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.