‘మన్మథుడు’ మామూలోడు కాదు.. మూడో హీరోయిన్ కావాలట…

0
39

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం మన్మథుడు. ఈ చిత్రం గతంలో వచ్చిన మన్మథుడు చిత్రానికి సీక్వెల్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాలోని కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ని కూడా విడుదల చేశారు. ఈ లుక్స్ ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే కన్నడ బ్యూటీ అక్షర గౌడ ఈ చిత్రంలో నాగార్జున గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించేందుకు ఎంపిక చేశారు. అయితే, ఈ టాలీవుడ్ మన్మథుడికి రకుల్‌, అక్షరలతో పాటు మరో హీరోయిన్‌ కావాలని కోరుకున్నాడు.

దీంతో చిత్ర యూనిట్ నిశితంగా దృష్టిపెట్టగా, నాగ్ ప్రియురాలి పాత్రకు కీర్తి సురేష్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం కీర్తి సురేశ్ చాలా సినిమాలతో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలో కీర్తి ఈ సినిమాను సైన్ చేసే అవకాశాలు చాలా తక్కువ అని ఫిలింనగర్‌లో టాక్. అయితే కీర్తి ఒప్పుకోని నేపథ్యంలో ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధంలో చిత్ర బృందం పడిపోయింది.

కాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున కోడలు సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. వెన్నెల కిషోర్, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.