గ‌ణిత మేధావి ‘శకుంత‌లా దేవి’గా విద్యాబాలన్

0
197

బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఈమె తొలిసారి ద‌క్షిణాది శృంగార తార సిల్క్ స్మిత బ‌యోపిక్ ‘డ‌ర్టీపిక్చ‌ర్స్’లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇటీవల ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో బసవతారకం పాత్రలో నటించింది సూపర్బ్ అని అనిపించుకుంది. ఇప్పుడు మ‌రో బ‌యోపిక్‌లో టైటిల్ పాత్ర పోషించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

హ్యుమ‌న్ కంప్యూట‌ర్‌గా పేరు తెచ్చుకున్న గ‌ణిత మేధావి ‘శకుంత‌లా దేవి’ పాత్ర‌లో విద్యాబాల‌న్ న‌టించ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో తెలిపారు. అనుమీన‌న్ ద‌ర్శ‌కుడు. విక్ర‌మ్ మ‌ల్హోత్రా నిర్మాత‌. 2020 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా ప్ర‌ణాళిక‌లు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రికొన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తార‌ట‌.