నిత్యా మీనన్‌ను వాడుకోనున్న హీరో – దర్శకుడు

0
41

విధ్యమైన పాత్ర‌ల‌తో న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ నిత్యామీన‌న్‌. ఈ అమ్మ‌డుకు గత కొంతకాలంగా సరైన సక్సెస్‌లు లేవు. గీతగోవిందంలో అతిథిపాత్రలో మెరిసింది. హీరోయిన్‌గా సరైన హిట్ పడలేదు. అయితే, హీరో నితిన్ విష‌యంలో మాత్రం ఈమెది గోల్డెన్ గ‌ర్లే. ఎందుకంటే, ప‌దేళ్లుగా స‌క్సెస్‌లేని నితిన్ ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంతయ్యిందే సినిమాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించాడు. ఈ రెండు చిత్రాల్లోనూ నిత్యామీననే హీరోయిన్‌ కావడం గమనార్హం.

మరి నిత్యా త‌న ల‌క్‌తో మ‌రో ఇద్ద‌రికీ స‌క్సెస్‌ల‌ను తెస్తుందేమో చూడాలి. ఇంత‌కీ ఎవ‌రా ఇద్ద‌రు? అనే సందేహం వ‌స్తుంది. ఒక‌రేమో డైరెక్ట‌ర్ విజ‌య్ కుమార్ కొండ‌.. మ‌రొక‌రు హీరో రాజ్‌త‌రుణ్‌. ముందు విజ‌య్‌కుమార్ కొండ విష‌యానికి వ‌స్తే.. ఈ ద‌ర్శ‌కుడి తొలి చిత్రం ‘గుండెజారిగ‌ల్లంత‌య్యిందే’ సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యింది. ఇందులో నితిన్‌, నిత్యామీన‌న్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. త‌దుప‌రి నాగ‌చైత‌న్య‌తో ‘ఒక‌లైలా కోసం’ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు విజ‌య్‌కుమార్ కొండ‌. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ డైరెక్ట‌ర్‌కి అవ‌కాశాలే క‌రువ‌య్యాయి.

ఇక రాజ్‌త‌రుణ్ విష‌యానికి వ‌స్తే కెరీర్ ప్రారంభంలో హీరోగా వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ఈ యువ హీరో ఇప్పుడు అవ‌కాశాలు బొత్తిగా క‌రువ‌య్యాయి. ఎలాగైనా మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాల‌ని రాజ్‌త‌రుణ్ దిల్‌రాజు బ్యాన‌ర్లో “ఇద్ద‌రిదీ ఒక‌టే లోకం” సినిమా చేస్తున్నాడు. అలాగే ఓ సినిమా త్వ‌ర‌లోనే అనౌన్స్ కానుంది. ఈ సినిమాకు విజ‌య్ కుమార్ కొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. కాగా.. ఇందులో హీరోయిన్‌గా నిత్యామీన‌న్ న‌టించ‌నుంది. అందుకే వీరిద్దరూ నిత్యామీనన్‌పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.