అతిపెద్ద పార్టీగా బీజేపీ.. రాహుల్ చేతికి చంద్రబాబు రిపోర్టు

0
48

ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇదే విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక నివేదిక ఇచ్చినట్టు సమాచారం.

నిజానికి ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో గెలుస్తామని బీజేపీ నేతలు బయటకు ధీమాగా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. 2014లో మోడీకి ఉన్నంత సానుకూలత ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ లేదు. ఐదేళ్లలో పేద, మధ్య తరగతి వర్గాలను నేరుగా ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకున్న కేంద్రం తీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.

ఈ క్రమంలో అసలు బీజేపీకి మెజార్టీ ఎంత వస్తుంది? అటుపై కాంగ్రెస్ ఎంతవరకు కోలుకుంటుంది? లేదా ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉందా? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితిల్లో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం.. లేదా ఆ పార్టీ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయనేది రాజకీయ నిపుణులు అంచానా.

ఇదే విషయాన్ని చంద్రబాబు, రాహుల్‌కు ఓ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా చంద్రబాబు అంచనా ప్రకారం బీజేపీకి వంద సీట్లు ఖచ్చితంగా తగ్గిపోతాయని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతుందని చంద్రబాబు తన రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే బీజేపీ కన్నా కాంగ్రెస్‌కు యాభై సీట్లు తక్కువ వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు.

కానీ, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతీయ పార్టీలకు అత్యధిక సీట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఏపీలో గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని చంద్రబాబు, రాహుల్‌కు ఇచ్చిన రిపోర్ట్‌లో పేర్కొనట్లు సమాచారం. ప్రధాని మోడీ, బీజేపీ అధినేత అమిత్‌షా రాజకీయాలకు చెక్ పెట్టే వ్యూహాలపై రాహుల్‌కు చంద్రబాబు సలహాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.