రాఖీ సావంత్‌ను కాల్చిపారేయాలంటున్న నెటిజన్లు

0
44

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఏ పని చేసినా అది వివాదాస్పదమే అవుతుంది. అటు నటిగా, ఇటు మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పైగా, ఈమెకు వివాదాలంటే మహాయిష్టం. ఈ కారణంగానే ఆమె తన ప్రతిభ కంటే వివాదాల కారణంగానే ఎక్కువ గుర్తింపు పొందింది.

తాజాగా, తన ఎదపై పాకిస్థాన్ జెండా కప్పుకుని తన్మయత్వంలో మునిగిపోతున్న రాఖీ సావంత్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘ధారా 370’ అనే సినిమాలో పాకిస్థానీ అమ్మాయిగా నటిస్తున్న రాఖీ రెచ్చిపోయి నటించిందన్నది ఆ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది.

కొన్ని చోట్ల పాకిస్థాన్ జెండాను ప్రదర్శించడం, మరికొన్నిచోట్ల ఆ జెండాను ఎదపై కప్పుకుని కనిపించడం చూడొచ్చు. అంతేకాదు, పాకిస్థాన్‌లో అందరూ చెడ్డవాళ్లు కాదని, ప్రతి దేశంలోనూ మంచి చెడులు ఉంటాయని చెబుతూ పాక్‌కు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టింది. దీనిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

తానే గనుక సైన్యంలో ఉంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రాఖీని కాల్చిపారేస్తానంటూ ఓ నెటిజన్ ఆవేశం ప్రదర్శించాడు. దేశంలో కల్లోలానికి కారణమవుతూ, ఎంతోమందిని బలిగొంటున్న పాక్ కు మద్దతిస్తావా? అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.