శ్రీవారి బంగారం ఎంతో తెలుసా..? 9వేల కేజీలకు పైచిలుకే

0
53
Venkateswara Swami
Venkateswara Swami

తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. కానుకల పేరిట విలువైన వస్తువులను సమర్పించుకుంటారు. అలా కానుకల రూపంలో శ్రీవారికి చేరిన ఆస్తి భారీగా వుంది. ఇందులో బంగారం మాత్రం ఎంతో తెలుసా? తొమ్మిదివేల కిలోల పై చిలుకే. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని ఓ సీనియర్ అధికారి పేర్కొన్న వివరాల ప్రకారం స్వామివారి వద్ద 9,259 కేజీల బంగారం నిల్వలు ఉన్నాయి.

ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోనే 5,387 కిలోల బంగారం డిపాజిట్లు ఉండగా, ఆ తర్వాత 1,938 కిలోల బంగారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఇటీవలే తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకు 1,381 కేజీల బంగారాన్ని డిపాజిట్ కాలపరిమితి ముగియడంతో స్వామివారికి తిప్పిపంపడం తెలిసిందే.