మోడీ కథ అపుడే ముగిసేది : యశ్వంత్ సిన్హా

0
41

గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్లు దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయాయి. ఈ అల్లర్లు జరిగిన సయమంలో దేశ ప్రధానిగా ఏబీ వాజ్‌పేయి ఉన్నారు. అల్లర్లపై తీవ్ర కలత చెందిన వాజ్‌పేయి.. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీతో రాజీనామా చేయించాలని భావించారని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తెలిపారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కనుక వెనక్కి తగ్గకుంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కథ అప్పుడే ముగిసేదన్నారు.

దేశాన్ని కుదిపేసిన గోద్రా అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీతో రాజీనామా చేయించాలని వాజ్‌పేయి భావించారన్నారు. అయితే, మోడీ కనుక రాజీనామాకు తిరస్కరిస్తే ఏకంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వాజ్‌పేయి కఠినమైన నిర్ణయం కూడా తీసుకున్నారని సిన్హా చెప్పారు.

అయితే, మోడీకి అప్పటి కేంద్ర హోంమంత్రి అద్వానీ రూపంలో పెద్ద అండ దొరికిందన్నారు. మోడీని పదవి నుంచి తప్పిస్తే తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అద్వానీ బెదిరించారని, దీంతో వాజ్‌పేయి వెనక్కి తగ్గారని సిన్హా వివరించారు. ఆ రోజు కనుక వాజ్‌పేయి వెనక్కి తగ్గకుంటే మోడీ కథ అప్పుడే ముగిసి ఉండేదని యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు.