సీట్లు – మెజార్టీ అంశాలపై మాట్లాడను.. పవన్ కళ్యాణ్

0
71

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈనెల 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మరణించిన ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ఆయన శనివారం పరామర్శించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సాప్వత్రికంతో పాటు శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది? ముఖ్యంగా తాను పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎంత మెజారిటీ వస్తుందనే విషయాలపై స్పందించబోనని ముందుగానే విలేకరులకు చెప్పారు.

ఈ ఎన్నికలు ఖచ్చితంగా మార్పునకు నాంది పలుకుతాయనే విశ్వాసం, నమ్మకం తనకు ఉందన్నారు. తాము కూడా ఈవీఎంల వాడకంలో వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపును పెంచాలని కోరుకుంటున్నట్టు పవన్ తెలిపారు. ఈ స్లిప్పులు ఎంత శాతం లెక్కించాలనే అంశాలను నిపుణులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.