ముగిసిన బి. నాగిరెడ్డి కుమారుడి అంత్యక్రియలు

0
44

విజయ-వాహిని సంస్థల అధినేత దివంగత బి.నాగిరెడ్డి కుమారుడు బి.వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం చనిపోయారు. ఆయన వయసు 75 యేళ్లు. ఈయన అంత్యక్రియలు ఆదివారం ఉదయ జరిగాయి.

ఈయన తమిళంలో ఐదు చిత్రాలు నిర్మించారు. విజయ్ బ్యానర్‌పై ప్రముఖ హీరోలు అజిత్, విజయ్, ధనుష్, విశాల్‌తో ఆయన సినిమాలు తీశారు. ఆయన గతంలో శ్రీకృష్ణార్జున యుద్ధం, బృందావనం వంటి బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రాలని కూడా నిర్మించారు.

ప్రతి యేడాది ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట పురస్కరాలు అందిస్తుంటారు. వెంకట్రామి రెడ్డి మృతిపై తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.