అక్కినేని ఇంటి కోడలు, హీరోయిన్ సమంతకు ఇప్పటివరకు తిరుగులేకుండా ఉంది. పెళ్లి తర్వాత ఆమె కెరీర్ పీక్ స్టేజ్కు వెళ్లింది. వివాహం తర్వాత ఆమె నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్ అయింది. దీంతో దర్శక నిర్మాతలు ఆమె వెంట పడుతున్నారు. అయితే, ఆమెకు పోటీగా “జెర్సీ” భామ శ్రద్ధా శ్రీనాథ్ తయారవుతోందట.
అయితే, గత యేడాది విశాల్ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన “అభిమన్యుడు” సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో విశాల్ ఆర్మీ ఆఫీసర్గా, సమంత ఒక సైక్రియాట్రిస్ట్గా నటించింది. అయితే ఆ హిట్ సినిమాకి విశాల్ ఇపుడు సీక్వెల్ చేయాలనుకుంటున్నాడు.
మొదటి సినిమా “ఇరుంబు తిరై”లో నటించిన నటీనటులే దాదపుగా తీనుకుంటున్నాడట విశాల్. అయితే ‘ఇరుంబు తిరై” సీక్వెల్లో మళ్లీ హీరోయిన్గా సమంత నటిస్తుందా? అంటూ రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
కానీ, ఈ చిత్రంలో విశాల్కి సమంత జోడి కట్టడం లేదట. ప్రస్తుతం తెలుగులో ‘జెర్సీ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుందనే టాక్ కోలీవుడ్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వకముందే తమిళనాట కూడా పాపులర్ హీరోయిన్గా ఉన్న విషయం తెల్సిందే.
ఇక తెలుగు “జెర్సీ” సూపర్ హిట్ అవడం, తమిళంలో ఆమె చేసిన “కె 13” కూడా సూపర్ హిట్ అవడంతో విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తే అటు తెలుగు ఇటు తమిళనాట కూడా క్రేజ్ ఉండని శ్రద్దని తీసుకున్నారట. మరి “జెర్సీ” సినిమా హిట్ తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ పేరు యంగ్ హీరోస్ సరసన బాగానే మార్మోగిపోతోంది.