అబ్బాయిల వెంటపడను… నిధి అగర్వాల్

0
35

సినీ ఛాన్సుల కోసం పాడు పనులకు చేయడానికి సమ్మతించబోనని యువ హీరోయిన్ నిధి అగర్వాల్ స్పష్టం చేసింది. పైగా, అబ్బాయిల వెంట తానుపడబోనని, వారే తన వెంట పడేలా నడుచుకుంటానని ఈ అందాల తార చెబుతోంది.

హీరోల వెంటపడి ప్రేమించే పాత్రల్లో నటించి నిధిని…అబ్బాయిల ఆకర్షణలో పడిపోతారా అని అడిగితే… సినిమాల్లోని పాత్రాల్లా బయట ప్రవర్తిస్తామా అని ఎదురు ప్రశ్నించింది. సినిమాల్లో నటించే పాత్రలకు నిజ జీవితంలో వ్యక్తిత్వానికి పోలికలు పెట్టొద్దని విజ్ఞప్తి చేసింది.

అన్ని సినిమాల్లో గొప్ప పాత్రలు దక్కాలని కోరుకోకూడదు. కొన్ని ప్రేమ కథలు, మరికొన్ని యాక్షన్‌ నేపథ్యంగా తెరకెక్కుతుంటాయి. యాక్షన్‌ చిత్రాల్లో నాయికగా నాకు నటించే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు. అదే ప్రేమ కథల్లో నాయిక కీలకంగా ఉంటుంది. ఇలా అవకాశాన్ని బట్టి మా నట ప్రతిభ ప్రదర్శించే వీలు కలుగుతుంది.

నాయిక అన్నప్పుడు అన్ని చేయాల్సిందే. కథానాయకుడితో పాటల్లో ఆడిపాడటం తప్పు కాదు. అయితే ఆ పాట ప్రేక్షకులను ఒప్పించేలా ఉండాలి. దర్శకుడు ఆ జాగ్రత్త తీసుకోవాలి. నాయికగా పాటల్లో కనిపించేందుకు నాకెలాంటి అభ్యంతరాలు లేవు అని చెప్పింది.

కాగా, మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన నిధి… “మున్నా మైఖేల్‌” చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ తర్వాత తెలుగులో “మిస్టర్‌ మజ్ను” చిత్రంతో అడుగుపెట్టింది. “సవ్యసాచి” ఆమె రెండో చిత్రం కాగా… ప్రస్తుతం “ఇస్మాట్‌ శంకర్‌” చిత్రంలో నటిస్తోంది. నాయికగా తనకు వస్తున్న అవకాశాల పట్ల సంతృప్తిగా ఉందీభామ.