ఆ వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా.. సాధ్వీ ప్రజ్ఞా సింగ్

0
39

వివాదాస్పద నేత, భోపాల్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఎట్టకేలకు దిగివచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చేశారు. ఇవి దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి.

ముఖ్యంగా, బీజేపీ నేతలు సైతం ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. దాంతో, ఆమె తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్టు తన ప్రతినిధి హితేశ్ వాజ్‌పేయితో ఓ ప్రకటన చేయించారు. గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు సాధ్వీ క్షమాపణ తెలియజేశారని హితేశ్ వాజ్‌పేయి వెల్లడించారు.

ఆమె క్షమాపణ చెప్పినా విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ కూడా సాధ్వీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాషాయ వస్త్రాలు ధరించిన నిజమైన దేశ ద్రోహులు వీరేనంటూ మండిపడ్డారు.