ఇలియానాకు ఏమైంది?

0
37

తెలుగు వెండితెరకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్ ఇలియానా. ఈ గోవా బ్యూటీ ఇపుడు అందవిహీనంగా తయారైంది. నిజానికి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నప్పుడే అందంపై మంచి శ్రద్ధపెడతారు. పైగా, వెండితెరపై మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు.

కెరీర్లో సినిమాలు రావడం తగ్గిపోతే… క్రమంగా అందంపై శ్రద్ద కొద్దిగా సన్నగిల్లుతుంది. గోవా బ్యూటీ ఇలియానా విషయంలోనూ జరిగింది. “దేవదాస్” సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఇల్లీ… తర్వాత టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేసింది. ప్రిన్స్ మహేష్ బాబుతో “పోకిరి”, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో “జల్సా” వంటి చిత్రాలు చేసింది. పైగా, ఈ చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే, “దేవుడు చేసిన మనుషులు” సినిమా తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్‌కు టాటా చెప్పింది. బాలీవుడ్‌లో బోలెడు సినిమాలు చేసి… మళ్ళీ రవితేజ “అమర్ అక్బర్ ఆంటోనీ” సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీతో అభిమానులు షాక్ అయ్యారు. బొద్దుగా ఉండటంతో కామెంట్లు వచ్చాయి.

వీటికి సమాధానంగా ఇలియానా తిరిగి సన్నగా మారి నాజూగా తయారైంది. సన్నగా మారింది సరే.. అందంపై పెద్దగా దృష్టిపెట్టలేదు అనుకుంటా.. పేస్‌లో వయసు తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం.