తుది దశ పోలింగ్ ప్రారంభం… ఓటేసిన యోగి ఆదిత్యనాథ్

0
34

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి 7 రాష్ట్రాల్లోని 59 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ప్రారంభమైంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో విస్తరించిన 59 లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లోని 10,01,75,153ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు, పంజాబ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లోని 9, మధ్యప్రదేశ్‌లోని 8, బీహార్‌లోని 8, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4, జార్ఖండ్‌లోని 3, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల నుంచి 918 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరింపజేశారు. ఆదివారం జరిగే పోలింగ్‌తో కలిపితే దేశంలో 542 నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిసినట్లవుతుంది. చివరి దశ పోలింగ్‌ సందర్భంగా దేశంలోని అందరి కళ్లూ వారణాసి నియోజకవర్గంపైనే ఉన్నాయి. ఇక్కడ మోడీ, మరో 25 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.