తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటి చార్మీ కౌర్. అగ్ర హీరోలనందరితోనూ నటించింది. కానీ, దర్శకుడు పూరీ జగన్నాథ్కు అత్యంత సన్నిహితురాలు. వీరిద్దరి మధ్య ఆ సంబంధం ఉందనీ, ఈ కారణంగానే పూరీ దంపతుల మధ్య మనస్పర్థలు కూడా తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తలను వారిద్దరూ ఖండించలేదు.
ఈ నేపథ్యంలో చార్మీ రెండు రోజుల క్రితం పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్ పాత్రలు వేయకుండా పూరీ జగన్నాథ్ నిర్మించే చిత్రాల నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. పైగా, నిర్మాతగా మారి ఇస్మార్ట్ శంకర్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ నపేథ్యంలో పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి తనకు లేదని, పిల్లలను కనాలనే ఉద్దేశం కూడా తనకు లేదని చార్మీ తేల్చి చెప్పింది. వైవాహిక జీవితాన్ని గడపాలనే కోరిక తనకు లేదని తెలిపింది. పెళ్లి, పిల్లలు తదితర అంశాలు తనకు ఎంతమాత్రం సెట్ కావని అంటోంది. ఇండిపెండెంట్గా ఉండేందుకే తాను ఇష్టపడుతానని తెలిపింది. కష్టపడి పని చేయడంతో వచ్చే విజయమే తనకు సంతృప్తిని ఇస్తుందని చెప్పుకొచ్చింది. తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని చార్మీ చెప్పడంతో ఆమె అభిమానులు షాక్కు గురవుతున్నారు.