పీపుల్స్ స్టార్ చేసిన పని ఖంగుతిన్న మెగాస్టార్

0
62

మెగాస్టార్ చిరంజీవి అంటే.. ఆషామాషీ కాదు. తన కుటుంబ హీరోలు నటించిన చిత్రాల ఆడియో ఫంక్షన్లలో కనిపించడమే చాలా అరుదు. అలాంటిది తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని పీపుల్స్ స్టార్‌గా ఉన్న ఆర్.నారాయణ మూర్తి చిత్ర ఆడియో విడుదలకు హాజరయ్యారు.

ఆర్.నారాయణ మూర్తి తాజా చిత్రం మార్కెట్‌లో ప్రజాస్వామ్యం. ఈ చిత్రం ఆడియో లాంచ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. దీనికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాధారణంగా చిరంజీవి ఏ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లినా ఎలాంటి తినుబండారాలు తీసుకోకుండా వెళ్లిపోతారు. ఈసారి కూడా అలాగే జరుగుతుందని అక్కడున్న వారు అనుకున్నారు.

అయితే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా ప్లేట్‌లో పకోడీలు పెట్టి.. చిరంజీవి చేతికి ఇచ్చి అవి తినేవరకూ ఆర్.నారాయణ మూర్తి అక్కడే ఉన్నారు. ఎవరూ ఊహించని ఈ పనిని మెగాస్టార్‌తో పీపుల్స్ స్టార్ చేయించడంతో ఆశ్చర్యపోవడం అక్కడి వారి వంతైంది. ప్రస్తుతం చిరంజీవి పకోడీలు తింటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో స్నేహ చిత్ర పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. చిత్ర ఆడియోను మంగళవారం విడుదల చేశారు. ఈ ఆడియో వేడుకకు అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర ఆడియో సీడీలను విడుదల చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ వేడుక జరిగింది.