ఈ దేహం ఈ దేశ ప్రజల కోసమే : నరేంద్ర మోడీ

0
48

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. గురువారం ఉదయం నుంచి వెల్లడైన ఎన్నికల ఫలితాల తర్వాత సాయంత్రం ఆయన ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి మరోమారు అధికారం అప్పగించినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మూడు హామీలిచ్చారు.

* తాను వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా ముందుకెళ్తానని మరోమారు చెబుతున్నానన్న మోడీ తన సమయం, తన శరీరాన్ని దేశ ప్రజల కోసమే ఉపయోగిస్తానని హామీ ఇచ్చారు.

* 2014వ సంవత్సరం వరకు తానెవరనేది చాలామందికి తెలియదని, 2019 నాటికి అందరికీ తెలిసిందనీ, తనపై చాలా విశ్వాసం ఉంచారని గుర్తుచేశారు. దాని వెనుక ఉన్న భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనన్నారు. తానెప్పుడు తప్పుడు పనులు చేయబోనని తేల్చిచెప్పారు.

* ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం గురించి మర్చిపోయానని, దేశాభివృద్ధి కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకుని, వారితో కలిసి ముందుకు సాగుతానని చెప్పారు.