చాలా మంది వివాహమయ్యాక తమకు త్వరగా పిల్లలు పుట్టాలని తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంటారు. కానీ, ఈ హీరోయిన్ మాత్రం తనకు పిల్లలే వద్దని, పిల్లలు పుడితే లైఫ్లో థ్రిల్ ఉండదని అంటోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరన్నదే కదా మీ సందేహం.. ఎవరో కాదు.. కవితా కౌశిక్.
ఈమె తన జీవితంలో సంచలన నిర్ణయం తీసుకుంది. హిందీ సీరియల్స్ చేస్తూ అక్కడ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కవితా కౌశిక్… తీసుకున్న నిర్ణయం విని అంతా షాకవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ముంబైలో బాగా ఫేమస్. సోనీ టీవీలో వచ్చే ఎఫ్ఐఆర్ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువైంది కవితా కౌశిక్.
ఈ మధ్యే తను ప్రేమించిన రోనిత్ బిశ్వాస్ను రెండేళ్ల కింద పెళ్లి చేసుకుంది. ఇన్నేళ్లైనా ఇంకా విశేషం లేదా అంటే జీవితంలో తాము పిల్లలే కనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సంచలన నిజం బయటపెట్టింది.
ఎందుకు తాను ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పింది. ఒకవేళ పిల్లలు పుడితే లైఫ్ సరిగ్గా ఎంజాయ్ చేయలేమని చెబుతుంది. పైగా తామిద్దరం ఇప్పుడు 40కి చేరువలో ఉన్నామని.. ఇప్పుడు పిల్లల అవసరం లేదనిపిస్తుందని చెబుతోంది.
తాము పిల్లలను కంటే వాళ్లకు 20 వచ్చే సరికి తాము 60ల్లో ఉంటామని.. అప్పటికి వాళ్లు తమ పనులు వదిలేసి మమ్మల్ని చూసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు యవ్వనంలో చేయాల్సిన ఎంజాయ్మెంట్ కూడా చేయకుండా తమ కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది.
అందుకే అప్పుడు వాళ్లను కష్టపెట్టేకంటే ఇప్పుడు తామే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంటే మంచిదంటుంది కవిత కౌశిక్. మొత్తానికి ఈమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ నిర్ణయానికి ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూడాలిక.