సాయి పల్లవిని ఏడిపించిన దర్శకుడు..

0
32

తమిళ పిల్ల సాయి పల్లవి. అచ్చం తెలుగు అమ్మాయిలా ఉండే ఈమె ఫిదా చిత్రంతో కుర్రకారును ఫిదా చేసింది. పైగా తాను నటించిన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. మాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ రాణిస్తోంది. తాజాగా సూర్యకు భార్యగా నటించిన సినిమా “ఎన్జీకే” ఈనెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో మరో హీరోయిన్‌గా రకుల్ కూడా నటిస్తోంది.

ఈ సినిమా ప్రచారంలో సాయిపల్లవి మీడియాతో మాట్లాడుతూ.. ఓ సీన్‌లో తను నటించిన విధానం దర్శకుడికి నచ్చలేదని షూటింగ్‌ను తర్వాత రోజుకు వాయిదావేశారు. ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాను.

“నా నటనతో సెల్వరాఘవన్‌ ఇంప్రెస్‌ అవ్వలేదు. నేను ఇంటికి వెళ్లి మా అమ్మకు విషయం చెప్పి బాగా ఏడ్చాను. నేను మంచి నటిని కాదు నేను మెడికల్ ప్రోఫెషన్‌కు వెళ్లిపోతానని చెప్పేశాను. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను. దేవుడి దయతో తర్వాత రోజు నా తొలి టేక్‌ను దర్శకుడు ఓకే చేశారు. దాంతో నేను చాలా సంతోష పడ్డాను” అని చెప్పారు.