యాభై ప్లస్ అయితే ఏంటి.. ముదురు హీరోలే ముద్దు : రకుల్

0
50

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండే అగ్ర హీరోలంతా యాఫై ప్లస్‌లో ఉన్నవారే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీరి వయసు 50పైమాటే. వీరికి హీరోయిన్లు దొరకడం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం తెలుగులే అనుష్క, నయనతార వంటి వారు మినహా మరొకరు లేదు. కుర్రకారు హీరోయిన్లు వారి సరసన ఎంపిక చేస్తే ఆ జోడీ తండ్రీకుమార్తెలుగా ఉంటోంది.

దీంతో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా వంటివారే ఆప్షన్‌గా మారిపోయారు. ఈ ఒక్క కారణంగానే రకుల్ ప్రీత్ సింగ్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రకుల్ ఇపుడ టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునతో నటిస్తోంది. అలాగే, బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్‌తో దేదే ప్యార్ దే అనే చిత్రంలో నటించింది.

ఈ పరిస్థితుల్లో కుర్ర హీరోలతో నటించారా, ముదురు హీరోలంటే అంత ఇష్టమా అని మీడియా ప్రశ్నిస్తే ఆమె ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. 50 ప్ల‌స్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తే త‌ప్పేంటి అని ప్ర‌శ్నిస్తోంది. ఏ హీరోతో అయినా చేసే న‌ట‌న అదే క‌దా అనేది ఆమె మాట‌.

ప్ర‌స్తుతం ఆమె 59 ఏళ్ల నాగార్జున‌కి ప్రియురాలిగా న‌టిస్తోంది “మ‌న్మ‌థుడు 2” చిత్రంలో. ఇక బాలీవుడ్‌లో 51 ఏళ్ల అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌స‌న “దే దే ప్యార్ దే” చిత్రంలో యంగ్ ల‌వ‌ర్‌గా న‌టించింది. ఎంతైనా ముదురు హీరోలు అయితే మంచి అనుభవం ఉంటుంది కదా.