జగన్ మధ్యాహ్నం 12 గంటలకు.. మోడీ రాత్రి 7 గంటలకు….

0
47

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన ప్రమాణం చేయనున్నారు. ఆయన 30వ తేదీ గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణం చేస్తారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే రోజు రాత్రి 7 గంటలకు ప్రమాణం చేస్తారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో మోడీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈయన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురువారం రాత్రి 7 గంటలకు జరుగుతుందని రాష్ట్రపతి భవన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మోడీతో పాటు మరికొంతమంది మంత్రులు ప్రమాణం చేస్తారు.